

దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే-మ్యూంగ్ గౌరవార్థం నిర్వహించిన విందు కార్యక్రమంలో కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రాజకీయ ప్రముఖులతో పాటు సినీ, సంగీత రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ సందర్భంగా శశి థరూర్ తన సోషల్ మీడియా వేదికగా కొన్ని ఆసక్తికరమైన ఫొటోలను పంచుకున్నారు.
విందు కార్యక్రమం అనంతరం బయటకు వస్తుండగా ఊహించని వ్యక్తులను కలిసినట్లు ఆయన పేర్కొన్నారు. “మేడ్ ఇన్ కొరియా” స్టార్ ప్రియాంకా మోహన్ను కలవడం ఆనందంగా ఉందని, ప్రస్తుతం భారత్లో ఉన్న కే-పాప్ స్టార్ ఆరోరాతో కూడా ముచ్చటించినట్లు తెలిపారు. వారితో కలిసి దిగిన ఫొటోలను ఆయన సోషల్ మీడియాలో షేర్ చేశారు.
శశి థరూర్ పోస్ట్ను తన ఖాతాలో పంచుకున్న ప్రియాంకా మోహన్, ఎంపీకి ధన్యవాదాలు తెలిపారు. “ఈ రోజు ఎంతో ఆనందంగా గడిచింది. మీరు తీసిన నా ఫొటో చాలా బాగుంది. ఇవి నిజంగా ఎప్పటికీ మర్చిపోలేని క్షణాలు” అంటూ ఆమె స్పందించారు.













.webp&w=3840&q=75)






.webp&w=3840&q=75)

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!