

తెలంగాణ ఐటి, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించిన వివరాల ప్రకారం, అమెరికాకు చెందిన ప్రోటోల్యాబ్స్ హైదరాబాద్లో ప్రపంచ స్థాయి గ్లోబల్ సామర్థ్య కేంద్రం (జీసీసీ) ఏర్పాటు చేయనుంది. ఆరోహన్ గ్లోబల్ కన్సల్టింగ్తో కలిసి ఈ కేంద్రాన్ని స్థాపించనున్న సంస్థ, దాదాపు 300 మందికి ఉద్యోగావకాశాలు కల్పించనుంది. ప్రోటోల్యాబ్స్ ప్రతినిధి బృందం సచివాలయంలో మంత్రిని కలిసి తమ విస్తరణ ప్రణాళికలను వివరించగా, హైదరాబాద్ను ఎంపిక చేసుకోవడంపై ప్రభుత్వం హర్షం వ్యక్తం చేసింది.
గత ఏడాది కాలంలో 80కి పైగా జీసీసీలు ఏర్పడటానికి రాష్ట్రంలో ఉన్న మౌలిక సదుపాయాలు, అనుకూల విధానాలు, బలమైన ఎకోసిస్టమ్ కారణమని మంత్రి తెలిపారు. డిఫెన్స్, ఏరోస్పేస్ రంగాల్లో తెలంగాణ కీలక కేంద్రంగా ఎదుగుతోందని పేర్కొన్నారు. ఈ కొత్త కేంద్రం ద్వారా డిజైన్, ఇంజినీరింగ్, ప్రోటోటైపింగ్, డిజిటల్ తయారీ రంగాల్లో విస్తృత కార్యకలాపాలు కొనసాగుతాయని తెలిపారు. దీని వల్ల స్టార్టప్స్, ఎంఎస్ఎంఈలు, పెద్ద పరిశ్రమలకు ప్రయోజనం కలుగడంతో పాటు ఉత్పత్తులను వేగంగా మార్కెట్లోకి తీసుకురావడం సులభమవుతుందని చెప్పారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!