

ఐపీఎల్ 2026 సీజన్ ముగిసిన అనంతరం టీమ్ ఇండియా తొలి విదేశీ పర్యటనగా ఐర్లాండ్కు వెళ్లనుంది. ఈ పర్యటనకు సంబంధించిన జట్టులో యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీకి చోటు దాదాపు ఖాయమని బీసీసీఐ వర్గాలు సూచిస్తున్నాయి. అయితే అతన్ని ఏ స్థానంలో ఆడించాలి, ఎవరిని పక్కన పెట్టాలి అన్నది జట్టు యాజమాన్యానికి పెద్ద సవాల్గా మారుతోంది. ఇప్పటికే జట్టులో అభిషేక్ శర్మ, సంజు శాంసన్, యశస్వి జైస్వాల్, ఇషాన్ కిషన్ వంటి దూకుడైన ఓపెనర్లు ఉన్నారు. ఈ పరిస్థితిలో వైభవ్కు అవకాశం ఇస్తే వీరిలో ఎవరిని తప్పిస్తారనే అంశం ఆసక్తికరంగా మారింది. ఐర్లాండ్తో జరిగే సిరీస్ నేపథ్యంలో కొంతమందిని వేరే స్థానాల్లో ఆడించే అవకాశం కూడా పరిశీలనలో ఉంది. మరోవైపు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్కు ఈ సిరీస్లో చోటు దక్కకపోవచ్చని సమాచారం వెలువడుతోంది.
ఇక జట్టు నాయకత్వంపై కూడా సెలక్షన్ కమిటీ ముందుకు మరో ప్రశ్న వచ్చింది. సూర్యకుమార్ యాదవ్ను పక్కనపెడితే, ఐర్లాండ్ సిరీస్కు అభిషేక్ శర్మ లేదా సంజు శాంసన్కు నాయకత్వ బాధ్యతలు అప్పగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే వైభవ్కు స్థానం కల్పించేందుకు వీరిలో ఎవరినైనా పక్కనపెడితే, దానికి తగిన కారణం చెప్పాల్సిన బాధ్యత బీసీసీఐపై ఉంటుంది. సూర్యకుమార్ను కొనసాగిస్తూ, మంచి ఫామ్లో ఉన్న ఇతర ఆటగాళ్లను పక్కనపెట్టడంపై ప్రశ్నలు తలెత్తే అవకాశం ఉంది. అందువల్ల సూర్యకుమార్కు విశ్రాంతి ఇచ్చి, అభిషేక్ లేదా సంజులో ఒకరికి కెప్టెన్సీ అప్పగించడం సరైన నిర్ణయమవుతుందని క్రికెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!