

పార్లమెంట్ నియోజకవర్గాల డీలిమిటేషన్ అంశంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. నియోజకవర్గాల పునర్విభజన వల్ల దక్షిణాది రాష్ట్రాలకు ఎలాంటి అన్యాయం జరగదని ఆయన స్పష్టం చేశారు. డీలిమిటేషన్ ప్రక్రియను తప్పుగా అర్థం చేసుకోవడం వల్ల అనవసర అపోహలు వ్యాప్తి చెందుతున్నాయని తెలిపారు.
దక్షిణాది రాష్ట్రాలు లోక్సభ సీట్లు కోల్పోతాయనే వాదనలో నిజం లేదని ప్రధాని పేర్కొన్నారు. జనాభా తగ్గితే సీట్లు కూడా తగ్గుతాయనే ప్రచారం పూర్తిగా అవాస్తవమని ఆయన అన్నారు. ఈ అంశంపై ప్రజల్లో స్పష్టత అవసరమని, తప్పుడు సమాచారాన్ని నమ్మవద్దని సూచించారు.
డీలిమిటేషన్ ప్రక్రియ సమగ్రంగా, సమానత్వంతో అమలు చేయబడుతుందని ప్రధాని వెల్లడించారు. అన్ని రాష్ట్రాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకుంటామని, దేశవ్యాప్తంగా సమతుల్యతను కాపాడే విధంగా చర్యలు ఉంటాయని ఆయన భరోసా ఇచ్చారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!