

అయ్యన్నకు మద్దతుగా దళిత సంఘాలు నిలిచాయి. ఈ సందర్భంగా, జగన్మోహన్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే గణేష్ వెంటనే క్షమాపణ చెప్పాలని దళిత సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ ఘటనకు సంబంధించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వారు స్పష్టం చేశారు.
డాక్టర్ సుధాకర్ మరణానికి ముందు, మాజీ ఎమ్మెల్యే గణేష్ తన ఇంటికి పిలిపించి హింసించి లెటర్ రాయించుకున్నట్లు పేర్కొంటూ ఒక సంచలన వీడియోను దళిత సంఘాలు విడుదల చేశాయి. ఈ వీడియో ఆధారంగా జరిగిన ఘటనపై తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ విషయాన్ని గౌరవ సభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకున్నారు.
అలాగే, సుధాకర్ కుటుంబాన్ని పరామర్శించిన చంద్రబాబు నాయుడు, లోకేష్ కోటి రూపాయల ఆర్థిక సాయం తో పాటు ప్రభుత్వ ఉద్యోగం కూడా అందించారు. ఈ నేపథ్యంలో సుధాకర్ మృతికి కారణమైన వారు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని దళిత సంఘాలు గట్టిగా డిమాండ్ చేస్తున్నాయి.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!