

యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్ అలియాస్ షన్ను ఇటీవల వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టాడు. ఈ ఏడాది ఫిబ్రవరి చివర్లో వైష్ణవి చోడిశెట్టి అనే యువతితో తన నిశ్చితార్థం జరిగినట్లు ప్రకటించిన ఆయన, తాజాగా కుటుంబ సభ్యులు మరియు సన్నిహిత మిత్రుల సమక్షంలో ఓ రిసార్ట్లో వివాహం చేసుకున్నట్లు సమాచారం. అయితే ఈ వివాహ విషయాన్ని షన్ను లేదా వైష్ణవి అధికారికంగా వెల్లడించలేదు. పెళ్లి ఫోటోలను షేర్ చేసిన ఫొటోగ్రాఫర్ ద్వారా ఈ విషయం బయటకు వచ్చింది. ఫోటోల్లో వధూవరులు కనిపించినప్పటికీ, తాళి కట్టే దృశ్యాలు మాత్రం ఇంకా బయటకు రాలేదు.
వైజాగ్కు చెందిన షణ్ముఖ్ జస్వంత్ తన కెరీర్ను యూట్యూబర్గా ప్రారంభించి ‘వైవా’ షార్ట్ ఫిల్మ్ ద్వారా మంచి గుర్తింపు పొందాడు. అనంతరం పలు తెలుగు చిత్రాల్లో సహాయ పాత్రలు పోషించిన ఆయన, ‘సాఫ్ట్వేర్ డెవలపర్’, ‘సూర్య’ వంటి యూట్యూబ్ సిరీస్లతో విపరీతమైన ప్రజాదరణ సంపాదించాడు. అదేవిధంగా, బిగ్బాస్ రియాలిటీ షోలో పాల్గొని రన్నరప్గా నిలిచాడు. ఈ షో తర్వాత సహ యూట్యూబర్ దీప్తి సునైనాతో ఆయన బ్రేకప్ అయ్యాడు. కొంతకాలానికి వైష్ణవి చోడిశెట్టితో ప్రేమలో పడి, ఇప్పుడు ఆమెతో వివాహ బంధంలోకి అడుగుపెట్టాడు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!