

తెలంగాణ రాష్ట్రానికి చెందిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తూ ప్యాడీ కొనుగోలు సమస్యలపై అత్యవసర విజ్ఞప్తి చేశారు. రబి 2024-25 సీజన్కు 5 లక్షల మెట్రిక్ టన్నుల బాయిల్డ్ రైస్ టార్గెట్ను నిర్ణయించాలని కోరారు. అలాగే ఎఫ్సీఐ రా రైస్ టార్గెట్ను తగ్గించాలని సూచించారు. ప్రస్తుతం 8.45 లక్షల మెట్రిక్ టన్నుల రైస్ డెలివరీ ఇంకా పెండింగ్లో ఉందని తెలిపారు. ఇప్పటికే గడువు ముగిసిన నేపథ్యంలో, ఈ సరఫరా పూర్తి చేయడానికి మరో 60 రోజుల గడువు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. 5% బ్రోకెన్స్తో బాయిల్డ్ రైస్ సరఫరాకు మిల్లర్లు అంగీకరించినట్లు కూడా మంత్రి పేర్కొన్నారు.
అదేవిధంగా, KMS 2025-26 సీజన్కు బాయిల్డ్ రైస్ టార్గెట్ను 20 LMTల నుంచి 40 LMTలకు పెంచాలని డిమాండ్ చేశారు. ఖరీఫ్ సీజన్లో 71.86 LMTలు, రబి సీజన్లో 95 LMTల ప్యాడీ ఉత్పత్తి అంచనా వేసినట్లు తెలిపారు. అయితే పెరిగిన ఉత్పత్తికి సరిపడా టార్గెట్లు లేకపోవడంతో రాష్ట్రం ఆందోళనలో ఉందని చెప్పారు. కేంద్రం టార్గెట్లు తగ్గించడం వల్ల నిల్వలు పెరుగుతున్నాయని, రైతులకు కనీస మద్దతు ధర (MSP) అందించాలంటే నిరంతర కొనుగోలు అవసరమని వివరించారు. అదనపు ప్యాడీ కారణంగా రాష్ట్రంపై భారీ ఆర్థిక భారం పడుతోందని పేర్కొంటూ, మరో రెండు నెలల గడువు పొడిగింపుతో పాటు కేంద్రం సానుకూల నిర్ణయం తీసుకోవాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి కోరారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!