
న్యూస్

శర్వానంద్ – శ్రీను వైట్ల కాంబినేషన్లో రాబోతున్న ‘జార్జ్ క్రిష్’ సినిమాలో హీరోయిన్గా మమిత బైజు ఎంపిక అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంతకుముందు పూజా హెగ్డే పేరు వినిపించినా, తాజా సమాచారం ప్రకారం మమిత బైజు ఫైనల్ అయ్యే అవకాశం ఉంది. ఈ సినిమా కోసం శర్వానంద్ తన లుక్పై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ, బరువు పెరుగుతున్నాడు.
ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. గత చిత్రం విశ్వం విజయంతో శ్రీను వైట్ల మళ్లీ టాలీవుడ్లో తన స్థానం బలపరచుకోవాలని చూస్తున్నారు. ఈ కాంబినేషన్పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా పూర్తి వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి. మమితా బైజు క్రేజ్ ఈ సినిమాకు ఎంతవరకు ప్లస్ అవుతుందో చూడాలి.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!