
క్రీడలు

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏప్రిల్ 28 న విశాఖలో గూగుల్ డేటా సెంటర్ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. సుమారు 15 బిలియన్ డాలర్ల భారీ పెట్టుబడితో 601 ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టనున్నారు. ఈ డేటా సెంటర్ 2028 జూలై నాటికి పూర్తిగా అందుబాటులోకి రానుందని అధికారులు తెలిపారు.
ఈ ప్రాజెక్ట్ ద్వారా ఐటీ రంగంలో భారీగా పెట్టుబడులు వచ్చే అవకాశం ఉండటంతో పాటు, వేల సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు సృష్టించబడనున్నాయి. దీంతో రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి మరియు డిజిటల్ మౌలిక వసతుల పెంపుకు ఇది కీలకంగా మారనుంది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!