

కర్నూలు జిల్లాలో జరిగిన భయంకర బస్ ప్రమాదం 20మందికి పైగా ప్రాణాలు బలిగొనడంతో తెలుగు రాష్ట్రాల ప్రజలు తీవ్ర షాక్కు గురయ్యారు. ఈ ఘటనపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు వెంటనే స్పందించి చర్యల్లోకి దిగాయి.
ప్రభుత్వ వర్గాల ప్రకారం, మరణించిన వారి కుటుంబాలకు రూ.5 లక్షలు, గాయపడిన వారికి రూ.2 లక్షల పరిహారం అందజేయనున్నట్లు ఇరు ప్రభుత్వాలు ప్రకటించాయి. ఈ పరిహారం త్వరలోనే పంపిణీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు.
అదేవిధంగా, ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రైవేట్ ట్రావెల్స్ సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని ట్రాఫిక్, ట్రాన్స్పోర్ట్ శాఖలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశాయి.
తెలంగాణలో ఇప్పటికే ట్రాన్స్పోర్ట్ శాఖ అధికారులు నగర పరిధిలోని పలు ప్రైవేట్ బస్సులను ఆపి తనిఖీలు నిర్వహించారు. డ్రైవర్లపై బ్రెతలైజర్ పరీక్షలు కూడా నిర్వహించారు. మద్యం సేవించి డ్రైవింగ్ చేస్తున్నారా అనే అంశంపై సీరియస్గా పరిశీలించారు.
ఇక ఆంధ్రప్రదేశ్లో కూడా జిల్లా సరిహద్దుల్లో ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. అనుమతులు లేని, పత్రాలు పూర్తి కాని పలు బస్సులను అధికారులు ఆపి కేసులు నమోదు చేశారు. దాదాపు 10 బస్సులపై చర్యలు తీసుకున్నట్లు సమాచారం.
ప్రస్తుతం ఇరు ప్రభుత్వాలు తాత్కాలిక చర్యలు తీసుకున్నా, ప్రజలు మాత్రం దీర్ఘకాలికంగా రోడ్డు భద్రతా సంస్కరణలు, ప్రైవేట్ ట్రావెల్స్ నియంత్రణ, డ్రైవర్ శిక్షణా విధానాలు వంటి అంశాలపై మరింత దృష్టి సారించాలని డిమాండ్ చేస్తున్నారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!