

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో మీడియాతో చిట్చాట్ సందర్భంగా కీలక రాజకీయ వ్యాఖ్యలు చేశారు. బీజేపీతో పొత్తు పెట్టుకున్న పార్టీలకు రాజకీయంగా దీర్ఘకాలిక మనుగడ ఉండదని ఆయన వ్యాఖ్యానించారు. నితీష్ కుమార్, ఏక్నాథ్ షిండే పరిస్థితులను తాము గమనిస్తున్నామని పేర్కొన్న ఆయన, భవిష్యత్లో చంద్రబాబు నాయుడు పరిస్థితి కూడా అదే దిశలో మారే అవకాశముందని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం కేంద్రంలో బీజేపీకి సీట్లు తక్కువగా ఉండటంతోనే టీడీపీకి ప్రాధాన్యం ఇస్తున్నారని, భవిష్యత్లో బలం పెరిగితే టీడీపీని పక్కన పెట్టే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు.
లోక్సభ, రాజ్యసభలు చట్టాలు రూపొందించడానికి మాత్రమేనని, వాటిని అమలు చేయాల్సింది రాష్ట్ర ప్రభుత్వాలేనని సీఎం స్పష్టం చేశారు. రెండు మూడొంతుల మెజార్టీ ఉన్నంత మాత్రాన అన్నీ నిర్ణయాలు చేయలేమని, ప్రజాస్వామ్య వ్యవస్థలో ఏకపక్ష విధానాలు సాధ్యం కాదని అన్నారు. “తానే రాజు” అనే విధంగా చట్టాలు చేసుకుంటే అది అంగీకారయోగ్యం కాదని, డిక్టేటర్షిప్ను ఎవ్వరూ ఒప్పుకోరని వ్యాఖ్యానించారు. ఏపీలో ప్రతిపక్షానికి కేవలం 11 సీట్లు మాత్రమే ఉన్నాయన్న విషయాన్ని ప్రస్తావించిన ఆయన, ఇలాంటి పరిస్థితుల్లో ఏకపక్ష నిర్ణయాలు సరైనవి కావని అన్నారు. అలాగే 2011 జనాభా లెక్కల ప్రకారం మహిళలకు రిజర్వేషన్ అమలు చేయాలని ఆయన అభిప్రాయపడ్డారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!