
న్యూస్

తెలుగు సినిమా పాత్రికేయుల సంఘం జర్నలిస్టు మూర్తికు మరోసారి హెచ్చరిక జారీ చేసింది. అతన్ని ముందుగా మూడు నెలల పాటు సస్పెండ్ చేసినప్పటికీ, అతని ప్రవర్తనలో మార్పు రాలేదని సంఘం తెలిపింది. ఇప్పటికీ పిఆర్ బృందాలను ఒత్తిడి చేయడం, బెదిరించడం చేస్తున్నాడని ఆరోపణలు ఉన్నాయి.
పిఆర్ ప్రతినిధులు కంటెంట్ పంపించకపోతే తాను ఇతర మార్గాల్లో తెచ్చుకుంటానని, తర్వాత చూసుకుంటానని బెదిరిస్తున్నాడని సంఘం వెల్లడించింది. ఈ విషయం మీడియా వర్గాల్లో ఆందోళన కలిగిస్తోంది.
ఇకపై కూడా ఇదే విధంగా కొనసాగితే కఠిన చర్యలు తీసుకుంటామని సంఘం స్పష్టం చేసింది. తన ప్రవర్తన మార్చుకోకపోతే వచ్చే పరిణామాలకు తానే బాధ్యుడవుతాడని హెచ్చరించింది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!