

యుద్ధవిమానాలు, క్షిపణులు, డ్రోన్లతో నింగి నుంచి సాగుతున్న పోరు ఇప్పుడు భూతల యుద్ధంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలో గల్ఫ్ ప్రాంతంలో సైనిక బలగాల మోహరింపు వేగంగా పెరుగుతోంది. 82వ ఎయిర్బోర్న్ డివిజన్ వంటి ప్రత్యేక దళాలతో పాటు USS Tripoli వంటి నౌకలను రంగంలోకి దింపడం, భూతల యుద్ధానికి సన్నాహకంగా భావిస్తున్నారు. చర్చలు కొనసాగుతున్నప్పటికీ, ప్రస్తుత పరిస్థితులు యుద్ధం మరింత విస్తరించే అవకాశాలను సూచిస్తున్నాయి.
ఇక ఇరాన్ భూతల దాడులను ఎదుర్కొనేందుకు తన రక్షణ చర్యలను బలపరుస్తోంది. రివల్యూషనరీ గార్డ్ దళాలు కీలక దీవులు, వ్యూహాత్మక ప్రాంతాల్లో బలమైన మోహరింపును ఏర్పాటు చేస్తున్నాయి. ముఖ్యంగా హర్మూజ్ జలసంధి సమీప ప్రాంతాలు యుద్ధానికి కేంద్రబిందువుగా మారే అవకాశం ఉంది. గెరిల్లా దాడులు, దీర్ఘకాల ప్రతిఘటన వంటి వ్యూహాలతో ఇరాన్ సిద్ధమవుతుండగా, ఈ సంఘర్షణ పెద్ద ఎత్తున ప్రాణనష్టం, ప్రాంతీయ అస్థిరతకు దారితీయవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!