
న్యూస్

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు సోనియా గాంధీ గత కొన్ని రోజులుగా అస్వస్థతతో బాధపడుతూ ఈ నెల 24 న రాత్రి 10.22 గంటల సమయంలో న్యూఢిల్లీలోని సర్ గంగారాం ఆసుపత్రిలో చేరారు. జ్వరం కారణంగా ఆమెను ఆసుపత్రిలో చేర్చగా, ప్రస్తుతం నిపుణులైన వైద్యుల బృందం పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. ఈ సందర్భంగా ఆసుపత్రి ఛైర్మన్ డాక్టర్ విజయ్ స్వరూప్ ఈ రోజు ఆరోగ్య నివేదికను విడుదల చేశారు.
ప్రస్తుతం సోనియా గాంధీ ఆరోగ్యం నిలకడగా ఉందని, చికిత్సకు మంచి స్పందన ఇస్తోందని వైద్యులు తెలిపారు. సీనియర్ వైద్యుల పర్యవేక్షణలో ఆమెకు చికిత్స కొనసాగుతోందని, ఇంకా పరిశీలన అవసరం ఉందని పేర్కొన్నారు. శరీరంలో వ్యాపించిన సంక్రమణను తగ్గించేందుకు ఔషధాలు ఇస్తున్నట్లు సమాచారం. ముందస్తు జాగ్రత్తగా మరికొన్ని రోజులు ఆసుపత్రిలోనే ఉంచే అవకాశం ఉందని తెలిపారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!