

తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్ని కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు. యుగపురుషుడు ఎన్టీ రామారావు స్థాపించిన ఈ పార్టీ తరతరాల తెలుగు ప్రజల ఆకాంక్షలకు ప్రతిరూపమని పేర్కొన్నారు. పేదలకు కూడు, గూడు, గుడ్డ అందించాలనే ఎన్టీఆర్ సిద్ధాంతాలను కొనసాగిస్తున్నామని, టీడీపీ కార్యకర్తల పార్టీ అని ఆయన తెలిపారు. ఆవిర్భావ దినోత్సవం మన ఇంటి పండుగలా జరుపుకోవాలని పిలుపునిచ్చారు.
మరోవైపు, పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, తెలుగు వారి ఆత్మగౌరవ నినాదంతో టీడీపీ రాజకీయ సంచలనం సృష్టించిందని అన్నారు. నాలుగు దశాబ్దాలుగా ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనా పార్టీ బలంగా నిలిచిందని పేర్కొన్నారు. చంద్రబాబు నాయకత్వంలో అభివృద్ధి, సంక్షేమం దిశగా పార్టీ ముందుకు సాగిందని చెప్పారు. కూటమి ఐక్యతతోనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సాధ్యమని, ఆ స్ఫూర్తిని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!