.png&w=3840&q=75)

అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు ఇరాన్ ఎలా ప్రతిస్పందిస్తుందన్న విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరియు ఆయన సలహాదారుల అంచనాలు తప్పిపోయినట్లు కనిపిస్తోంది. ఇరాన్లో రాజకీయ పరిణామాల ముందు యుద్ధం వల్ల పెద్దగా ఇంధన సంక్షోభం తలెత్తదని వారు భావించారు. అయితే పరిస్థితి పూర్తిగా మారి ఇప్పుడు ప్రపంచ దేశాలు చమురు సంక్షోభాన్ని ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడింది. పరిస్థితిని నియంత్రించేందుకు అనేక దేశాలు వ్యూహాత్మక చమురు నిల్వలను విడుదల చేయాల్సిన పరిస్థితి ఏర్పడటం ఈ సంక్షోభ తీవ్రతను చూపిస్తోంది. అమెరికా ఇంధనశాఖ మంత్రి క్రిస్ వైట్ గతంలో ఇరాన్పై దాడులు జరిగినా పశ్చిమాసియాలో ఇంధన సరఫరాకు పెద్ద అంతరాయం కలగదని, చమురు మార్కెట్లు స్థిరంగానే ఉంటాయని చెప్పినప్పటికీ ఆ అంచనాలు నిజం కాలేదు.
ఇరాన్ చమురు రవాణాను అడ్డుకుంటుందన్న ఆందోళనలు ఇప్పుడు నిజమయ్యాయి. కీలకమైన హర్మూజ్ జలసంధిని ఇరాన్ మూసివేయడంతో పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో నౌకా రవాణా తీవ్రంగా దెబ్బతింది. రవాణా నౌకలపై దాడులు పెరగడంతో ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు పెరిగాయి. ఈ పరిస్థితి అమెరికా ప్రభుత్వానికి సవాల్గా మారింది. యుద్ధ పరిస్థితులపై చట్టసభ సభ్యులకు ఇచ్చిన వివరణ అనంతరం కనెక్టికట్కు చెందిన డెమోక్రాట్ సెనేటర్ క్రిస్టోఫర్ ఎస్ మర్ఫీ ట్రంప్ ప్రభుత్వానికి హర్మూజ్ జలసంధిని తిరిగి తెరవడానికి స్పష్టమైన ప్రణాళిక లేదని వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో ఇరాన్ సముద్రంలో సీమైన్లు అమర్చి నౌకా రవాణాను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తుండగా, వాటిని అమర్చే నౌకలను అమెరికా లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తోంది. ప్రతిగా ఇరాన్ నేరుగా రవాణా నౌకలను లక్ష్యంగా చేసుకోవడం యుద్ధ తీవ్రతను మరింత పెంచుతోంది.
.png&w=3840&q=75)









కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!