
న్యూస్

భారత్ రాష్ట్ర సమితి త్రిసభ్య బృందం పార్టీ ఫిరాయింపుల కేసులు మరియు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన పరిణామాల నేపథ్యంలో కీలక న్యాయ చర్చల కోసం న్యూ ఢిల్లీ చేరుకుంది. కె. చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు సీనియర్ నేతలు టి. హరీష్ రావు, బి. వినోద్ కుమార్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర ఈరోజు సాయంత్రం ప్రముఖ న్యాయవాదులతో సమావేశం కానున్నారు.
ప్రస్తుతం హైకోర్టులో విచారణలో ఉన్న పార్టీ ఫిరాయింపుల కేసు, కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. అదేవిధంగా కాళేశ్వరం కమిషన్పై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నారు. హైకోర్టు తీర్పు త్వరలో వెలువడనుండగా, అది వ్యతిరేకంగా వస్తే సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు హరీష్ రావు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.


.webp&w=3840&q=75)



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!