
రాజకీయాలు

మణిపూర్ రాష్ట్రంలోని బిష్ణుపూర్ జిల్లాలో ఏప్రిల్ 7న జరిగిన బాంబు దాడిలో ఇద్దరు చిన్నారులు మరణించడంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఈ ఘటన ప్రజల్లో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది. దోషులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ప్రజలు పెద్ద ఎత్తున నిరసనలు చేపడుతున్నారు. పలుచోట్ల ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి.
పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి అధికారులు బిష్ణుపూర్, ఇంఫాల్ వెస్ట్, ఇంఫాల్ ఈస్ట్, థౌబల్, కాక్చింగ్ జిల్లాల్లో మొబైల్ ఇంటర్నెట్ సేవలను తాత్కాలికంగా నిలిపివేశారు. అపోహలు, తప్పుడు సమాచారాన్ని అడ్డుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం భద్రతా బలగాలు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాయి.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!