

ఇరాన్ మరియు అమెరికా మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. చర్చలు విఫలమైన నేపథ్యంలో ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ ఎక్స్ వేదికగా స్పందించారు. 47 ఏళ్ల తరువాత జరిగిన అత్యున్నత స్థాయి చర్చలకు తాము సదుద్దేశంతో వెళ్లామని తెలిపారు. ఒప్పందం కుదిరే దశలో ఉండగానే అమెరికా తన లక్ష్యాలను మార్చుకుందని ఆరోపించారు. గత అనుభవాల నుంచి అమెరికా ఎలాంటి పాఠాలు నేర్చుకోలేదని విమర్శించారు. మంచి ఉద్దేశాలు ఉంటే మంచి ఫలితాలే వస్తాయని, శత్రుత్వం ఉంటే అదే మిగులుతుందని పేర్కొన్నారు. ఇక హోర్ముజ్ జలసంధిలో నౌకల రాకపోకలు స్తంభించిపోయినట్లు లాయిడ్స్ లిస్ట్ ఇంటెలిజెన్స్ వెల్లడించింది.
హోర్ముజ్ను దిగ్బంధిస్తామన్న డోనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యల తరువాత ఈ పరిస్థితి నెలకొన్నట్లు సమాచారం. చర్చలు ఒప్పందం లేకుండానే ముగిసిన నేపథ్యంలో ట్రంప్ స్పందిస్తూ, గత కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగుతోందని తెలిపారు. ఇరాన్ మళ్లీ చర్చలకు వస్తుందా లేదా అనేది తనకు ఇక అవసరం లేదని అన్నారు. ఇప్పటికే ఇరాన్ పరిస్థితి దెబ్బతిన్నదని, మిలిటరీ బలహీనపడిందని పేర్కొన్నారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!