
సినిమాలు

రాష్ట్రంలో మరో మూడు ఎత్తిపోతల పథకాలు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని నిజాంసాగర్ ప్రాజెక్టు ప్రధాన కాలువపై సుమారు రూ.106.04 కోట్ల వ్యయంతో జకోరా, చందూరు, చింతకుంట ఎత్తిపోతల పథకాలు నిర్మించబడ్డాయి. ఈ పథకాలు ప్రారంభానికి సిద్ధమవడంతో రైతులకు సాగునీటి సౌకర్యం మరింత మెరుగుపడనుంది.
ఈ పథకాల ద్వారా వర్ని, చందూర్, మొస్రా మండలాల పరిధిలో ఉన్న 7,975 ఎకరాల ఆయకట్టుకు సమృద్ధిగా నీరు అందనుంది. నీటి పారుదల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్కుమార్ రెడ్డి త్వరలోనే ఈ పథకాలను ప్రారంభించనున్నారు. పనులు వేగంగా పూర్తవడం పట్ల మంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!