

తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు పైగా నమోదవుతుండగా, ఎండలు, ఉక్కపోత, వేడిగాలులు ప్రజలను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నప్పటికీ, ఎండల ప్రభావం తగ్గకపోవడంతో విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ పరిస్థితుల్లో హీట్ స్ట్రోక్ ప్రమాదం పెరుగుతుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.
తెలంగాణలో 10 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ కాగా, తెలుగు రాష్ట్రాల్లో తొలి వడదెబ్బ మరణం నమోదైంది. హన్మకొండ జిల్లా గట్లనర్సింగపూర్కు చెందిన శోభ ఎండల కారణంగా మృతి చెందడం ఆందోళన కలిగిస్తోంది. హైదరాబాద్లో కూడా 38 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా, ఉదయం నుంచే ఎండలు తీవ్రంగా మారుతున్నాయి. మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. కొబ్బరినీరు, మజ్జిగ వంటి చలువ పదార్థాలు తీసుకోవడం, బయట ఆహారం తగ్గించడం వంటి సూచనలు చేస్తున్నారు.














.jpeg&w=3840&q=75)







కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!