
టెక్నాలజీ

ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు కీలక దశకు చేరుకుంది. ఈ కేసు నేపథ్యంలో మాజీ ఎంపీ సంతోష్రావును సిట్ అధికారులు హైదరాబాద్లో మంగళవారం మధ్యాహ్నం 3 గంటల నుండి రాత్రి 10.30 వరకు సుమారు ఏడున్నర గంటలపాటు జరిగిన విచారణలో అధికారులు సంతోష్ సంబంధిత వివరాలు రికార్డు చేశారు. విచారణలో ఇంటెలిజెన్స్ చీఫ్గా ప్రభాకర్రావు నియామకంపై వివిధ ప్రశ్నలు అడిగారు.
ఫోన్ ట్యాపింగ్కు సంబంధించిన కొన్ని ఆధారాలను సిట్ అధికారులు సంతోష్రావు ముందు ఉంచి వివరణ కోరారు. విచారణ అనంతరం ఆయన స్టేట్మెంట్ను సిట్ అధికారులు రికార్డ్ చేశారు.
సంతోష్ విచారణ సమయంలో పూర్తిగా సహకరించారు. విచారణ అనంతరం మీడియా ప్రతినిధులతో మాట్లాడిన సంతోష్ మాట్లాడుతూ, సిట్ అధికారుల విచారణకు ఆయన పూర్తిగా సహకరించారని తెలిపారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!