
జనరల్

ఉత్తరాఖండ్లోని చార్ధామ్ యాత్ర మార్గంలో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడి భక్తులు, పర్యాటకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రం బద్రీనాథ్ మార్గంలోని జోషీమఠ్ వద్ద అనూహ్యంగా వాహనాల రద్దీ పెరగడంతో రహదారులు పూర్తిగా నిలిచిపోయాయి.
విష్ణు ప్రయాగ్ నుంచి సుమారు 15 కిలోమీటర్ల వరకు వాహనాలు కదలకుండా నిలిచిపోగా, మొత్తం ట్రాఫిక్ జామ్ 25–30 కిలోమీటర్ల వరకు విస్తరించింది. వేలాది మంది ప్రయాణికులు రోడ్డుపైనే చిక్కుకుపోయారు. అత్యవసర అంబులెన్స్ సేవలు కూడా నిలిచిపోవడంతో పరిస్థితి తీవ్ర ఆందోళనకరంగా మారింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!