
సినిమాలు

ఐపీఎల్ 2026 ఫైనల్ నేపథ్యంలో బెంగళూరు పోలీసులు కఠిన హెచ్చరిక జారీ చేశారు. మ్యాచ్ ఫలితాల అనంతరం ప్రజా వేడుకలు నిర్వహించరాదని, బైక్ ర్యాలీలు, స్టంట్లు, రోడ్లను అడ్డుకోవడం, అధిక హారన్ వినియోగం పూర్తిగా నిషేధమని స్పష్టం చేశారు.
అనుమతి లేకుండా పబ్లిక్ లైవ్ స్క్రీనింగ్స్, పటాకులు, ప్రమాదకర వస్తువుల వినియోగం కూడా నిషేధించారు. ప్రజా శాంతిభంగం, గొడవలు, రెచ్చగొట్టే సోషల్ మీడియా పోస్టులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గత ఏడాది ఆర్సీబీ వేడుకల్లో జరిగిన దురదృష్టకర తొక్కిసలాట పునరావృతం కాకుండా ఈ చర్యలు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!