

వచ్చే నెల 21 న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని యోగాంధ్ర-2026 కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని సీఎం చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. మంత్రులు, ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షలో కార్యక్రమాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.
వచ్చే నెల 7 నుంచి 14 రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా యోగాంధ్ర కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అమరావతిలో 25 వేల మందితో ప్రధాన రాష్ట్ర స్థాయి కార్యక్రమం జరగనుండగా సీఎం చంద్రబాబు పాల్గొంటారు. కృష్ణా నది వంతెనపై ప్రత్యేక యోగా కార్యక్రమం నిర్వహిస్తారు. జిల్లా కేంద్రాల్లో 1000 మంది చొప్పున కార్యక్రమాలు జరుగుతాయి. రాష్ట్రవ్యాప్తంగా కోటి మంది భాగస్వామ్యం లక్ష్యంగా పెట్టుకోగా, ప్రస్తుతం ఉన్న 1.5 లక్షల ట్రైనర్లకు అదనంగా మరో లక్ష మంది ట్రైనర్లకు శిక్షణ ఇవ్వనున్నారు. ప్రతి జిల్లాకు రూ.25 లక్షల నిధులు కేటాయించి 14 రోజుల పాటు థీమ్ ఆధారిత కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!