
బిజినెస్

భారత మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ ఆరోగ్య పరిస్థితి ఆందోళన కలిగిస్తోంది. ఆయన మెదడులో రక్త గడ్డ ఏర్పడిందని వైద్యులు గుర్తించారు. ఈ పరిస్థితి భవిష్యత్తులో బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ప్రమాదాన్ని పెంచుతుందని వైద్యులు హెచ్చరించారు. ఆయన స్నేహితుడు మార్కస్ కౌటో ఈ విషయాన్ని ధ్రువీకరించారు.
1990లలో భారత జట్టులోకి భారీ అంచనాలతో ప్రవేశించిన కాంబ్లీ గత కొంతకాలంగా అనేక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. కిడ్నీ ఇన్ఫెక్షన్, కండరాల నొప్పులతో గతంలో ఆసుపత్రిలో చికిత్స పొందారు. ప్రస్తుతం ఆయన జ్ఞాపకశక్తి సమస్యలు కూడా ఎదుర్కొంటున్నారని, చికిత్స కొనసాగుతోందని సమాచారం. కుటుంబ సభ్యులు, స్నేహితులు ఆయన ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


















.png&w=3840&q=75)



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!