
న్యూస్

సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు చెందిన యువ బౌలర్ ప్రఫుల్ హింగే అద్భుత ప్రదర్శనతో అరుదైన రికార్డు నెలకొల్పాడు. తన తొలి మ్యాచ్లోనే తొలి ఓవర్లో మూడు వికెట్లు తీసి చరిత్ర సృష్టించాడు. రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్లో ప్రఫుల్ హింగే కీలక ఆటగాళ్లను అవుట్ చేసి మ్యాచ్ను మలుపుతిప్పాడు. ఐపీఎల్ 19 సంవత్సరాల చరిత్రలో తొలి ఓవర్లోనే మూడు వికెట్లు తీసిన తొలి బౌలర్గా నిలిచాడు. ఇంతకుముందు మొదటి ఓవర్లో రెండు వికెట్లు తీసిన సందర్భాలు ఉన్నప్పటికీ, మూడు వికెట్లు పడగొట్టడం ఇదే మొదటిసారి.
హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ జట్టు 216 పరుగులు చేసింది. అనంతరం బౌలింగ్లో కూడా రాణించి, రాజస్థాన్ జట్టును 159 పరుగులకు ఆలౌట్ చేసింది. దీంతో ఐపీఎల్ 2026 సీజన్లో హైదరాబాద్ జట్టు తమ రెండో విజయాన్ని నమోదు చేసుకుంది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!