

ఆన్లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్ స్విగ్గీ నుంచి మరో సహవ్యవస్థాపకుడు నందన్ రెడ్డి తప్పుకోనున్నారు. 2014 ఆగస్టులో శ్రీహర్ష మాజేటి, రాహుల్ జైమిని, నందన్ రెడ్డి కలిసి ఈ సంస్థను స్థాపించారు. 2020లో రాహుల్ జైమిని కంపెనీని వీడి ‘పెస్టో టెక్’ అనే స్వంత సంస్థను ప్రారంభించగా, ఇప్పుడు నందన్ రెడ్డి కూడా అదే దారిలో ముందుకు సాగుతున్నారు. కొత్త అంకుర సంస్థను అభివృద్ధి చేయడంపై దృష్టి సారించేందుకు ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం స్విగ్గీ గ్రూప్ సీఈఓగా మరో సహవ్యవస్థాపకుడు శ్రీహర్ష మాజేటి కొనసాగుతున్నారు.
ఇక స్విగ్గీ బోర్డులో కూడా మార్పులు చోటుచేసుకోనున్నాయి. సంస్థలో 20 శాతం కంటే ఎక్కువ వాటా కలిగిన ప్రోసస్ తన నామినీ డైరెక్టర్లలో మార్పులు చేయాలని నిర్ణయించింది. రోజర్ క్లార్క్ రబాలియస్ తన పదవికి రాజీనామా చేయగా, అతని స్థానంలో రెనాన్ డె కాస్ట్రో ఆల్వెస్ పింటో బాధ్యతలు స్వీకరించనున్నారు. అలాగే బోర్డు సభ్యుల సంఖ్యను పెంచే యోచనలో కంపెనీ ఉంది. 2015లో స్విగ్గీలో చేరి వైస్ ప్రెసిడెంట్గా పనిచేసిన ఫణి కిషన్ అద్దేపల్లిని 2021లో సహవ్యవస్థాపకుడిగా పదోన్నతి కల్పించారు. ప్రస్తుతం చీఫ్ గ్రోత్ ఆఫీసర్గా ఉన్న ఫణి కిషన్, ముఖ్య ఆర్థిక అధికారి రాహుల్ బోథ్రా కూడా స్విగ్గీ బోర్డులో చేరనున్నట్లు సమాచారం. అయితే ఈ మార్పులకు వాటాదారుల అనుమతి అవసరం ఉంది.














.jpeg&w=3840&q=75)







కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!