

కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు ఎన్నికల కమిషన్ నోటీసులు జారీ చేసింది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై ‘ఉగ్రవాది’ అని వ్యాఖ్యానించిన విషయాన్ని సీరియస్గా తీసుకున్న ఈసీ, 24 గంటల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఖర్గే వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీయగా, బీజేపీ ప్రతినిధి బృందం ఎన్నికల కమిషన్ను కలిసి అధికారికంగా ఫిర్యాదు చేసింది.
బీజేపీ నాయకులు ఈ వ్యాఖ్యలను వ్యక్తిగత దూషణగా అభివర్ణిస్తూ, ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనగా పేర్కొన్నారు. ఖర్గేపై కఠిన చర్యలు తీసుకోవాలని, బహిరంగ క్షమాపణ చెప్పించాలని డిమాండ్ చేశారు. ఈసీని కలిసిన బృందంలో నిర్మలా సీతారామన్, కిరణ్ రిజిజు, అర్జున్ రామ్ మేఘ్వాల్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కిరణ్ రిజిజు మాట్లాడుతూ, ప్రధానమంత్రిని ఉగ్రవాదిగా పిలవడం దేశాన్ని అవమానించడమేనని అన్నారు. అంతకుముందే బీజేపీ ఈసీకి లేఖ రాసి, ఖర్గే వ్యాఖ్యలు చట్టవిరుద్ధమని, భారతీయ న్యాయసంహిత సెక్షన్ 175 కింద నేరంగా పరిగణించవచ్చని పేర్కొంది. కాంగ్రెస్ అధ్యక్షుడు వెంటనే క్షమాపణ చెప్పాలని కూడా డిమాండ్ చేసింది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!