
రాజకీయాలు

వరల్డ్ అథ్లెటిక్స్ రిలే పోటీలు బోట్సావానాలోని గాబ్రోన్లో వచ్చే నెల 2, 3 తేదీల్లో జరగనున్నాయి. ఐదు విభాగాల్లో మొత్తం 21 మంది సభ్యులతో కూడిన భారత జట్టు పోటీ పడనుంది. అనిమేష్ కుజుర్ నాయకత్వంలో బరిలోకి దిగనున్న ఈ జట్టులో ఎనిమిది మహిళా క్రీడాకారిణులు ఉన్నట్లు అదిల్లె సుమరివాలా తెలిపారు.
ఆరు విభాగాల్లో పోటీ పడాలని భావించినప్పటికీ మహిళల నాలుగు వందల మీటర్ల రిలే జట్టును ఎంపిక చేయలేదు. తెలంగాణకు చెందిన నిత్య గందె మహిళల వంద మీటర్ల నాలుగు మంది రిలే మరియు మిశ్రమ రిలే పోటీల్లో పాల్గొననుంది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నిలకడగా రాణిస్తున్న ఆమె ఈ టోర్నీలో మంచి ప్రదర్శన చేసి రాబోయే ఆసియా క్రీడలు మరియు కామన్వెల్త్ క్రీడలకు సిద్ధమవాలని లక్ష్యంగా పెట్టుకుంది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!