

గూగుల్ 2025లో భారత్లో నిబంధనలను ఉల్లంఘించిన 48.3 కోట్ల ప్రకటనలను బ్లాక్ లేదా తొలగించినట్లు వెల్లడించింది. అదే సమయంలో 17 లక్షల అడ్వర్టైజర్ ఖాతాలను నిలిపివేసింది. ఈ చర్యలను తన ఏఐ ప్లాట్ఫామ్ జెమినై సాయంతో చేపట్టినట్లు తెలిపింది. 2025 యాడ్స్ సేఫ్టీ రిపోర్ట్ ప్రకారం, మోసపూరిత మరియు తప్పుదారి పట్టించే ప్రకటనలను గుర్తించి అడ్డుకోవడంలో ఈ సాంకేతికత కీలక పాత్ర పోషించింది.
ప్రపంచవ్యాప్తంగా 830 కోట్లకు పైగా చెడు ప్రకటనలను గూగుల్ తొలగించగా, 2.49 కోట్ల అడ్వర్టైజర్ ఖాతాలను సస్పెండ్ చేసింది. వీటిలో 99 శాతం కంటే ఎక్కువ ప్రకటనలను వినియోగదారులు చూడకముందే నిలిపివేసినట్లు తెలిపింది. 2024తో పోలిస్తే యూజర్ ఫిర్యాదులపై తీసుకున్న చర్యలు నాలుగు రెట్లు పెరిగాయి. భారత్లో ప్రకటనల తొలగింపుకు ప్రధాన కారణాలు ట్రేడ్మార్క్, ఆర్థిక సేవలు, కాపీరైట్, పర్సనలైజేషన్ పాలసీ ఉల్లంఘనలు మరియు యాడ్ నెట్వర్క్ దుర్వినియోగం అని పేర్కొంది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!