
న్యూస్

భారతదేశంలో అత్యంత ధనవంతుడిగా నిలవడానికి పోటీ మరింత ఉత్కంఠభరితంగా మారింది. గతంలో ఎదురైన ప్రతికూల పరిస్థితులను అధిగమించిన గౌతమ్ అదాని మళ్లీ శక్తివంతంగా ఎదిగి అగ్రస్థానాన్ని దక్కించుకున్నారు. తాజా జాబితాలో ఆయన సంపద 92.6 బిలియన్ డాలర్లకు చేరుకుని భారతదేశం మరియు ఆసియాలో మొదటి స్థానాన్ని సంపాదించడమే కాకుండా ప్రపంచ స్థాయిలో 19 వ స్థానంలో నిలిచారు.
దీర్ఘకాలంగా అగ్రస్థానంలో ఉన్న ముకేష్ అంబానీ ప్రస్తుతం 90.8 బిలియన్ డాలర్ల సంపదతో రెండో స్థానంలో నిలిచారు. భారత కరెన్సీలో అదాని సంపద సుమారు 8.61 లక్షల కోట్లు కాగా, అంబానీ సంపద 8.35 లక్షల కోట్లుగా ఉంది. అయితే స్థిరత్వం విషయంలో అంబానీ వ్యాపారాలు నిరంతరంగా ఎదుగుతున్నాయని, అదాని సంస్థలు మాత్రం మార్కెట్ మార్పులతో పైకీ కిందకీ మారుతూ వస్తున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!