
పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల మధ్య అమెరికా విమాన వాహక నౌక యూఎస్ఎస్ అబ్రహం లింకన్పై దాడి చేసినట్లు ఇరాన్ రెవల్యూషన్ గార్డ్ ప్రకటించింది. బాలిస్టిక్ క్షిపణులు మరియు డ్రోన్లతో దాడి జరిపి ఆ నౌకను ధ్వంసం చేశామని తమ ప్రకటనలో పేర్కొంది. ఈ ఘటన ప్రాంతీయ ఉద్రిక్తతలను మరింత పెంచే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు.
అయితే ఈ ఆరోపణలను అమెరికా సెంట్రల్ కమాండ్ పూర్తిగా ఖండించింది. యూఎస్ఎస్ అబ్రహం లింకన్ సాధారణంగా కార్యకలాపాలు కొనసాగిస్తూ ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీకి సహాయం చేస్తోందని అమెరికా అధికారులు తెలిపారు. ఇరాన్ చేసిన ఆరోపణలకు ప్రతికగా నౌక సాధారణంగా పనిచేస్తున్నట్లు చూపించే ఫొటోను కూడా విడుదల చేశారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!