
టెక్నాలజీ

తిరుపతిలో ఇంధన కొరత సమయంలో ఒక పెట్రోల్ బంక్ యజమాని చేసిన సేవ అందరినీ ఆకట్టుకుంటోంది. తనపల్లి రోడ్డులో ఉన్న పెట్రోల్ బంక్ వద్ద రొమ్మల రాజేష్ రెడ్డి ఆధ్వర్యంలో ద్విచక్ర వాహనదారులకు ఉచితంగా ఒక లీటర్ పెట్రోల్ అందిస్తున్నారు. ప్రజల్లో ఉన్న భయాన్ని తగ్గించేందుకు ఈ చర్య తీసుకున్నట్లు తెలిపారు.
పెట్రోల్ నిల్వ ఉన్నంతవరకు, పరిస్థితి సాధారణ స్థితికి చేరుకునే వరకు ఈ ఉచిత పంపిణీ కొనసాగుతుందని ఆయన చెప్పారు. ఈ వార్త తెలిసిన వెంటనే పెద్ద సంఖ్యలో వాహనదారులు అక్కడికి చేరుకుని క్యూలో నిలుస్తున్నారు. ఈ చర్య స్థానిక ప్రజల ప్రశంసలను అందుకుంటోంది.
ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకుని వాహనదారులకు అర లీటర్ నీటి సీసాలను కూడా అందిస్తున్నారు. ఈ సేవతో ప్రజలకు ఆర్థికంగా సహాయం కావడంతో పాటు వేడి నుంచి ఉపశమనం కలుగుతోంది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!