

తెలంగాణ వ్యాప్తంగా కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో సమ్మె కొనసాగుతుండగా, సుమారు 150 బస్సులు, 600 మంది ఉద్యోగులు డిపోలకే పరిమితమయ్యారు. బస్టాండ్లు, డిపోల వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. చర్లపల్లి రైల్వే స్టేషన్లో ప్రయాణికులు రవాణా సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. ఇదే అదనుగా ఆటో డ్రైవర్లు అధిక ఛార్జీలు వసూలు చేయడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మెదక్, సంగారెడ్డి, కామారెడ్డి వంటి ప్రాంతాల్లో ఆర్టీసీ కార్మికులు, పోలీసుల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. అద్దె బస్సులను నడపడానికి అధికారులు ప్రయత్నించగా కార్మికులు అడ్డుకున్నారు. కరీంనగర్లో ప్రైవేట్ డ్రైవర్ నడిపిన బస్సు ప్రమాదానికి గురై ప్రయాణికులు గాయపడ్డారు. బస్సులు లేక విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు వెళ్లడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మంచిర్యాలలో అద్దె బస్ డ్రైవర్లు భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూ నిరసన చేపట్టారు. సమ్మె కొనసాగుతుండటంతో ప్రజల్లో ఆగ్రహం మరింత పెరుగుతోంది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!