

తిరుమల శ్రీవారి లడ్డూకు కల్తీ నెయ్యి సరఫరా జరిగిన ఘటనపై ప్రభుత్వం నియమించిన ఏకసభ్య కమిషన్ విచారణ ప్రారంభించింది. ఈ వ్యవహారంపై సమగ్రంగా దర్యాప్తు చేసేందుకు విశ్రాంత ఐఏఎస్ అధికారి, కమిషన్ ఛైర్మన్ దినేష్ కుమార్ రంగంలోకి దిగారు. తిరుపతిలోని పద్మావతి అతిథి గృహంలో కేసుకు సంబంధించిన కీలక దస్త్రాలను ఆయన నిశితంగా పరిశీలిస్తున్నారు. ఈ ఘటనలో ఎవరి పాత్ర ఉందో తేల్చేందుకు కమిషన్ అన్ని కోణాల్లో పరిశీలన చేపట్టింది.
రానున్న 12 రోజుల్లో పలువురు ఉన్నతాధికారులు, కీలక వ్యక్తులు, కిందిస్థాయి సిబ్బందిని విచారణకు పిలవనున్నట్లు సమాచారం. మాజీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్, మాజీ అదనపు ఈవో ధర్మారెడ్డి, ప్రస్తుతం సెలవులో ఉన్న బాలాజీ తదితరులను కమిషన్ త్వరలోనే ప్రశ్నించనుంది. కల్తీ వ్యవహారానికి బాధ్యులైన వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకునే ముందు నిబంధనల ప్రకారం వారి నుంచి వివరణలు స్వీకరించనున్నట్లు అధికారులు తెలిపారు.
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!