

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్ ప్రమాణస్వీకారం చేశారు. లోక్ భవన్లో నిర్వహించిన కార్యక్రమంలో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఆమెతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి పలువురు న్యాయమూర్తులు, ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. జస్టిస్ లీసా గిల్ బాధ్యతలు స్వీకరించడంతో ఏపీ హైకోర్టుకు కొత్త ప్రధాన న్యాయమూర్తి లభించారు.
జస్టిస్ లీసా గిల్ స్వస్థలం చండీగఢ్. అక్కడి కార్మెల్ కాన్వెంట్ స్కూల్లో పాఠశాల విద్య పూర్తి చేసి, ప్రభుత్వ మహిళా కళాశాలలో హ్యుమానిటీస్లో డిగ్రీ చేశారు. అనంతరం పంజాబ్ యూనివర్సిటీలో ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం పూర్తి చేశారు. 1990లో న్యాయవాదిగా నమోదు చేసుకుని పంజాబ్-హరియాణా హైకోర్టులో ప్రాక్టీస్ ప్రారంభించారు. సివిల్, క్రిమినల్, రెవెన్యూ, రాజ్యాంగ సంబంధిత కేసుల్లో విశేష అనుభవం సంపాదించారు. చండీగఢ్తో పాటు పలు ప్రభుత్వ బోర్డులు, కార్పొరేషన్లకు న్యాయపరంగా ప్రాతినిధ్యం వహించారు. 2014 మార్చి 31న పంజాబ్-హరియాణా హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు.








.jpg&w=3840&q=75)













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!