
న్యూస్

తమిళనాడులో మరోసారి ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. విరుదునగర్లోని బాణాసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించడంతో 18 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు. ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకురావడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు.
పేలుడు తీవ్రతకు పరిసర ప్రాంతాల్లోని పలు భవనాలు పూర్తిగా కూలిపోయాయి. శిథిలాల కింద ఇంకా పలువురు కార్మికులు చిక్కుకుపోయి ఉండే అవకాశం ఉందని అధికారులు అనుమానిస్తున్నారు. వారిని రక్షించేందుకు సహాయక చర్యలు వేగంగా కొనసాగుతున్నాయి. ఇదే ప్రాంతంలో వారం క్రితం బాణాసంచా గోడౌన్లో కూడా పేలుడు జరిగిన విషయం ఆందోళన కలిగిస్తోంది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!