
సినిమాలు

మార్కాపురం బస్సు ప్రమాద ఘటనపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో పలువురు మృతి చెందడం, మరికొందరు తీవ్రంగా గాయపడడం పట్ల ఆయన తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సీఎం సానుభూతి తెలియజేసి, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
నిర్మల్ నుంచి నెల్లూరు వైపు వెళుతున్న బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో మృతులు, గాయపడిన వారి పూర్తి వివరాలను సేకరించాలని ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుకు ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ అధికారులతో మాట్లాడి పూర్తి సమాచారం తీసుకోవాలని సూచించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు సీఎస్ రామకృష్ణారావు ఏపీ సీఎస్తో మాట్లాడారు.


















.png&w=3840&q=75)



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!