
న్యూస్
మెక్సికో సిటీ, ఈ రోజు కొలంబియాలోని పుటుమాయో ప్రాంతంలో జరిగిన విమాన ప్రమాదంలో మృతుల సంఖ్య 66కి పెరిగింది. సి-130 సైనిక రవాణా విమానం కూలిపోవడంతో ఈ దుర్ఘటన జరిగింది. ముందుగా 48 మంది మృతి చెందినట్లు సమాచారం వచ్చినప్పటికీ, తాజా వివరాల ప్రకారం మరణాల సంఖ్య పెరిగింది. మృతుల్లో ఎక్కువ మంది జాతీయ సైన్యానికి చెందినవారు కాగా, కొందరు ఎయిర్ ఫోర్స్ మరియు పోలీస్ విభాగాలకు చెందినవారిగా అధికారులు తెలిపారు.
ఈ విమానంలో మొత్తం 128 మంది సిబ్బంది ఉన్నట్లు సమాచారం. ప్యూర్టో లెగుయిజామో నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానం కూలిపోయింది. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియలేదు. ప్రస్తుతం అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.



















.png&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!