

తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను “సునామీ”గా పేర్కొంటూ దేశం ఎదుర్కొనే ముప్పుపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇబ్రహింపట్నంలో విద్యావేత్త, ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి స్థాపించిన ఏవీఎన్ లేక్ఫీల్డ్ గ్లోబల్ స్కూల్ ప్రారంభోత్సవంలో మాట్లాడిన ఆయన, వైట్ కాలర్ ఉద్యోగాలు కోల్పోతే దేశ ఆర్థిక వ్యవస్థ ప్రమాదంలో పడుతుందని హెచ్చరించారు. అందుకే ప్రత్యామ్నాయంగా బ్లూ కాలర్ ఉద్యోగాలకు అనుగుణంగా మారాల్సిన అవసరం ఉందని సూచించారు.
విద్యా రంగంలో నాణ్యత తగ్గిపోవడం పై ఆందోళన వ్యక్తం చేస్తూ, తక్షణ సంస్కరణలు అవసరమని సీఎం పేర్కొన్నారు. రాష్ట్రంలో 100 నియోజకవర్గాల్లో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలు నిర్మిస్తున్నామని, వచ్చే విద్యా సంవత్సరం నుంచి కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో నర్సరీ నుంచి 12 వ తరగతి విధానాన్ని అమలు చేయనున్నట్లు తెలిపారు. విద్యార్థులకు రవాణా సౌకర్యాలు, పోషకాహారం, క్రీడలకు ప్రోత్సాహం వంటి చర్యలు చేపడుతున్నామని వెల్లడించారు. దేశ భవిష్యత్తు కోసం నాణ్యమైన విద్య అత్యవసరమని ఆయన స్పష్టం చేశారు.

.webp&w=3840&q=75)




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!