
న్యూస్

ఇండోనేషియాలో తీవ్ర భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలు పై దీని తీవ్రత 7.4 గా నమోదైంది. భూకంప కేంద్రం టెర్నెట్ దీవికి సుమారు 127 కిలోమీటర్ల దూరంలో మొలుక్కా సముద్రంలో ఉన్నట్లు USGS వెల్లడించింది.
ఈ భూకంపం ప్రభావంతో సమీప దేశాలైన ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, మలేషియాలో సునామీ వచ్చే అవకాశం ఉందని Pacific Tsunami Warning Center హెచ్చరించింది. పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఇండోనేషియా ప్రభుత్వం వెంటనే సునామీ హెచ్చరికలు జారీ చేసింది.
ప్రస్తుతం పరిస్థితి పై అధికారులు నిశితంగా పరిశీలన కొనసాగిస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.






.webp&w=3840&q=75)






.avif&w=3840&q=75)








కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!