

దర్శకుడు నితేశ్ తివారీ తెరకెక్కిస్తున్న రామాయణ మూవీ నుంచి రణ్బీర్ కపూర్ రాముడి పాత్రలో కనిపించే గ్లింప్స్ విడుదలై భారీ హైప్ తెచ్చింది. అయోధ్యలోకి ఆయన ఎంట్రీ సీన్ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తోంది. ఈ చిత్రంలో సాయి పల్లవి సీతగా నటిస్తున్నారు. నిర్మాత నమిత్ మల్హోత్రాతో పాటు యష్ ఈ భారీ ప్రాజెక్ట్ను నిర్మిస్తున్నారు. రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ చిత్రం మొత్తం దాదాపు రూ. 4000 కోట్ల బడ్జెట్తో తెరకెక్కుతుందని సమాచారం. మొదటి భాగం ఈ ఏడాది దీపావళి కానుకగా విడుదల కానుంది.
ఇదిలా ఉంటే, ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ హక్కుల కోసం దాదాపు రూ. 1000 కోట్ల భారీ ఆఫర్ వచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ డీల్ను నిర్మాత నమిత్ మల్హోత్రా తిరస్కరించినట్లు సమాచారం. తక్షణ లాభం కంటే దీర్ఘకాలిక గ్లోబల్ మార్కెట్ను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేసి భారీ వసూళ్లు సాధించాలని నిర్మాతలు భావిస్తున్నారు. ఈ నిర్ణయం సినీ వర్గాలను ఆశ్చర్యపరిచినప్పటికీ, ప్రాజెక్ట్పై ఉన్న నమ్మకాన్ని స్పష్టం చేస్తోంది. దీంతో రామాయణ సినిమాపై అంచనాలు మరింతగా పెరుగుతున్నాయి.







.webp&w=3840&q=75)














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!