
సినిమాలు

కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ కాన్వాయ్పై కేరళలోని మలప్పురం జిల్లాలో నిన్న రాత్రి దాడి జరిగింది. ఎన్నికల ప్రచారం భాగంగా వండూర్కు వచ్చిన సమయంలో, బైక్లపై వచ్చిన కొందరు వ్యక్తులు ఆయన కాన్వాయ్ను అడ్డుకున్నారు. ఈ క్రమంలో వారు థరూర్పై దూషణలకు దిగుతూ దాడి చేయడానికి ప్రయత్నించడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
అయితే థరూర్ గన్మెన్ వెంటనే స్పందించి దాడిని అడ్డుకున్నాడు. ఈ సమయంలో దుండగులు గన్మెన్పై కూడా దాడి చేసినట్లు సమాచారం. అనంతరం ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు నమోదు చేశారు. ఈ సంఘటన రాజకీయ నాయకుల భద్రతపై ఆందోళనలకు దారితీస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.







.webp&w=3840&q=75)














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!