

తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పుదుచ్చేరిలో జరిగిన ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. మంత్రి పొన్నం ప్రభాకర్, పీసీసీ అధ్యక్షుడు వైద్యలింగంతో కలిసి మనవేలి నియోజకవర్గంలో అనంతరామన్కు, ఎం బాలం నియోజకవర్గంలో లక్ష్మీకాంతన్కు మద్దతుగా ప్రచారం చేశారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలంటే కాంగ్రెస్, డీఎంకే కూటమిని అధికారంలోకి తీసుకురావాలని ఆయన పిలుపునిచ్చారు.
కూటమి ఇచ్చిన హామీలను తప్పకుండా అమలు చేస్తామని భట్టి విక్రమార్క తెలిపారు. ఎన్డీఏ కూటమి చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని ప్రజలను హెచ్చరించారు. తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఉదాహరణగా చూపిస్తూ, గ్యారంటీలు అమలు చేయడం సాధ్యమేనని చెప్పారు. పుదుచ్చేరి అభివృద్ధి, మంచి భవిష్యత్తు కోసం కాంగ్రెస్ కూటమిని గెలిపించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!