
రాజకీయాలు

గ్యాస్ సిలిండర్ల బ్లాక్ మార్కెట్ను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రెండు గ్యాస్ సిలిండర్ బుకింగ్ల మధ్య ఉండే వ్యవధిని 21 రోజుల నుంచి 25 రోజులకు పెంచింది. ఈ నిర్ణయం ద్వారా గృహ వినియోగదారులకు సమానంగా సిలిండర్లు అందేలా చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం తెలిపింది.
ఇకపై దేశవ్యాప్తంగా గ్యాస్ సరఫరాలో గృహ అవసరాల సిలిండర్లకే ప్రాధాన్యం ఇవ్వాలని కేంద్రం ఆదేశించింది. అలాగే LPG ఉత్పత్తిని పెంచాలని రిఫైనరీలకు సూచనలు జారీ చేసింది. దీని ద్వారా వినియోగదారులకు గ్యాస్ కొరత లేకుండా సరఫరా జరిగేలా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు వెల్లడించారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!