
టెక్నాలజీ

వైష్ణోదేవి ఆలయం సమీపంలో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. కానుకల పేరుతో నకిలీ వెండి వస్తువులు, ఆభరణాలు సమర్పిస్తున్న వ్యవహారం బయటపడింది. దాదాపు 20 టన్నుల వరకు నకిలీ వెండి కానుకలు గుర్తించినట్లు సమాచారం. పరిశీలనలో కానుకల్లో కేవలం 5 నుంచి 6 శాతం మాత్రమే అసలైన వెండి ఉన్నట్లు తేలింది. మిగతా వాటిని వెండి పూతతో తయారు చేసిన వస్తువులుగా గుర్తించారు. ఇవే అసలైన వెండి అనుకుని భక్తులు కానుకలుగా సమర్పిస్తున్నారని తెలుస్తోంది.
ఈ మోసంతో ఆలయానికి రావాల్సిన ఆదాయం భారీగా తగ్గినట్లు సమాచారం. సుమారు రూ.550 కోట్లు రావాల్సి ఉండగా, వాస్తవంగా కేవలం రూ.30 కోట్లకే పరిమితమైనట్లు వెల్లడైంది. భక్తులను మోసం చేస్తూ వ్యాపారులు నకిలీ వెండి వస్తువులను సరఫరా చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!