
న్యూస్

పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ 131 వ రాజ్యాంగ సవరణ బిల్లు లోక్సభలో ఓడిపోవడం ప్రజాస్వామ్యం, రాజ్యాంగానికి విజయమని అన్నారు. ఉత్తర భారతంలో సీట్లు పెంచుకుని రాజకీయ లాభం పొందేందుకు చట్ట విరుద్ధంగా డీలిమిటేషన్ బిల్లు తీసుకురావాలని బీజేపీ ప్రయత్నించిందని, కానీ కాంగ్రెస్ మరియు ప్రతిపక్షాలు కలిసి ఆ ప్రయత్నాన్ని అడ్డుకున్నాయని తెలిపారు.
మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే చట్టానికి కాంగ్రెస్ మద్దతు ఇచ్చిందని, అయితే ఆ అమలును 2029 కి వాయిదా వేసే ప్రయత్నంలో భాగంగా బీజేపీ డీలిమిటేషన్ ద్వారా రాజకీయ లాభం పొందాలని చూశిందని విమర్శించారు. దేశవ్యాప్తంగా కుల గణన తర్వాతే చట్ట సవరణ చేయాలన్న కాంగ్రెస్ డిమాండ్ విజయవంతమైందని పేర్కొన్నారు. ఇది ప్రజాస్వామ్య విజయమని, మహిళా రిజర్వేషన్ల అమలుకు కాంగ్రెస్ పోరాటం కొనసాగుతుందని అన్నారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!