
రాజకీయాలు

రామ్ చరణ్ లైనప్లో ఉన్న పెద్ది సినిమా ఇప్పటికే భారీ అంచనాలు సృష్టిస్తోంది. ఈ సినిమా తర్వాత దర్శకుడు బుచ్చిబాబు సానాతో మరో భారీ ప్రాజెక్ట్ చేయనున్నట్లు సినీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్ కోసం చరణ్ ఇప్పటికే అడ్వాన్స్ కూడా ఇచ్చినట్లు సమాచారం, దీంతో ఈ కలయిక దాదాపు ఖరారైనట్టే భావిస్తున్నారు.
ప్రస్తుతం చరణ్ పెద్ది షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ స్పోర్ట్స్ డ్రామాలో జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తున్నారు. షూటింగ్ సమయంలో బుచ్చిబాబు దర్శకత్వంపై చరణ్ ఎంతో ఇంప్రెస్ కావడంతో మరోసారి కలిసి పని చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అయితే అధికారిక ప్రకటన ఇంకా రాలేదు. పెద్ది తర్వాత సుకుమార్తో సినిమా పూర్తి చేసి, ఆ తరువాత ఈ ప్రాజెక్ట్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అభిమానులు అధికారిక అప్డేట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!