
న్యూస్

తెలంగాణ రాష్ట్ర ఉద్యమం సమయంలో 2011 మార్చి 10 న నిర్వహించిన మిలియన్ మార్చ్ సందర్భంగా నమోదైన కేసులను కొట్టివేయాలని కోరుతూ మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు, కె. తారకరామారావు, టి. హరీశ్రావు హైకోర్టును ఆశ్రయించారు. విచారణ సందర్భంగా వారి తరఫు న్యాయవాది వాదిస్తూ, దర్యాప్తు సమయంలో ఫిర్యాదుదారులు పిటిషనర్లను గుర్తించలేదని, సంఘటన స్థలంలో వారు ఉన్నారనే స్పష్టమైన ఆధారాలు లేవని తెలిపారు.
ఇతర వైపు ప్రాసిక్యూషన్ వాదిస్తూ, ఈ ఘటనపై దర్యాప్తు చేసి పలువురు నిందితులపై అభియోగపత్రాలు దాఖలు చేసినట్లు తెలిపింది. అయితే కేసీఆర్, కేటీఆర్, హరీశ్రావులపై మాత్రం ఎలాంటి అభియోగపత్రాలు దాఖలు కాలేదని స్పష్టం చేసింది. ఇరువైపుల వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేస్తూ తదుపరి నిర్ణయాన్ని వాయిదా వేసింది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!